Study buddhism aryadeva 400

ఆర్యదేవుడు

ఆర్యదేవుడు ('Phags-pa'i lha) శ్రీలంకలో ఒక రాజకుటుంబంలో జన్మించారు. ఇతను క్రీ.శ 2 వ శతాబ్దం మధ్య నుంచి 3 వ శతాబ్దం మధ్య వరకు జీవించారు. కొన్ని కథనాల ప్రకారం ఆయన కమలం నుంచి జన్మించారు నాయి చెప్తారు. చిన్న వయస్సులోనే అతను సన్యాసిగా మారి అక్కడ బౌద్ధ గ్రంథాలైన త్రిపిటకాన్ని క్షుణ్ణంగా అభ్యసించి ఉదయభద్ర మహారాజు శాతవాహన రాజ్యంలో నాగార్జునుడితో కలిసి చదువుకోవడానికి దక్షిణ భారతదేశానికి బయలుదేరారు. ఉదయిభద్ర మహారాజు నాగార్జున మిత్రుడికి రాసిన ఉత్తరం, విలువైన మాలలను తీసుకున్నారు. ఆర్యదేవుడు శాతవాహన రాజ్యంలోని ఆంధ్రప్రదేశ్ లోని ఆధునిక నాగార్జునకొండ లోయకు ఎదురుగా ఉన్న పవిత్ర పర్వతాలైన శ్రీ పర్వతంలో నాగార్జునునితో కలిసి విద్యాభ్యాసం కొనసాగించారు.

ఆ సమయంలో శివభక్తుడైన మాతృచేతుడు నలందలో జరుగుతున్న డిబేట్ లో అందరినీ ఓడిస్తున్నాడు. ఆ ఛాలెంజ్ ను ఎదుర్కొనేందుకు ఆర్యదేవుడు వెళ్లారు. వెళ్లుతున్న మార్గ మధ్యంలో, ప్రత్యేక శక్తులను సాధించడానికి ప్రయత్నిస్తున్న ఒక ముసలావిడను అతను కలుసుకున్నారు, ఆమెకు ఒక పండిత సన్యాసి కన్ను అవసరం పడింది. జాలితో చలించిపోయిన అతను తన ఒక కన్ను ఆమెకు ఇచ్చారు, కానీ ఆమె దానిని తీసుకుని దానిని రాయితో పగులగొట్టింది. ఆ తర్వాత ఆర్యదేవుడు ఒకే కన్ను ఉన్న మనిషిగా ప్రసిద్ధి చెందారు. ఆర్యదేవుడు మాతృచేతుడిని డిబేట్, మరియు ప్రత్యేక శక్తులలో ఓడించి అతని శిష్యుడయ్యాడు.

ఆర్యదేవుడు నలందాలో చాలా సంవత్సరాలు ఉన్నారు. తర్వాత, అతను చనిపోయే ముందు తన బోధనలన్నింటినీ తనకు అప్పగించిన నాగార్జున వద్దకు తిరిగి వచ్చారు. ఆర్యదేవుడు దక్షిణ భారతదేశంలోని ఆ ప్రాంతంలో అనేక మఠాలను నిర్మించాడు మరియు విస్తృతంగా బోధనలను పంచారు, మహాయాన సంప్రదాయాన్ని స్థాపించారు, ముఖ్యంగా, మాధ్యమకా వాసులకు బోధిసత్వుని యోగ చర్యలపై నాలుగు వందల శ్లోకాల గ్రంథం (Byang-chub sems-dpa’i rnal-‘byor spyod-pa bzhi-brgya-pa’i bstan-bcos kyi tshig-le’ur byas-pa, Skt. Bodhisattvayogacarya-catuhshataka-shastra-karika) వివరించారు. దీనిని సంక్షిప్తంగా నాలుగు వందల లేదా నాలుగు వందల వచన గ్రంథం అంటారు. నాగార్జునుడి లాగా ఆర్యదేవుడు కూడా గుహ్యసమజ తంత్రానికి వ్యాఖ్యానాలు రాశారు.

Top