ఆధ్యాత్మిక గురువులు

బౌద్ధ బోధనలు బుద్ధుని నుండి, సాక్షాత్కార గురువుల వంశం ద్వారా గుర్తించబడినప్పుడు అవి ప్రామాణికమైనవిగా పరిగణించబడతాయి. దీనిలో మనకు నమ్మకం ఉన్నప్పుడు, ఆయా బోధనలను అభ్యసించడానికి మనం ప్రయత్నిస్తాము, వాటిని మనం అర్థం చేసుకుని సరిగ్గా అన్వయించినప్పుడు, అవి మనం కోరుకున్న ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తాయని నమ్ముతాం.

శాక్యముని బుద్ధుడు

2500 సంవత్సరాల క్రితం శాక్యముని బుద్ధుడు భారతదేశంలో నివసించారు, ఇతను జ్ఞానోదయం పొందిన తర్వాత, మిగతావాళ్లందరికి అలా ఎలా పొందాలో చూపించారు.

నాగార్జునుడు

శూన్యంపై బుద్ధుని బోధనలను వివరించిన అసలైన భారతీయ గురువు నాగార్జునుడు.

ఆర్యదేవుడు

ఆర్యదేవుడు (క్రీ.శ. 2 వ శతాబ్దం మధ్య - 3 వ శతాబ్దం మధ్య) నాగార్జునుడి ప్రధాన శిష్యుడు. శూన్యంపై నాగార్జున బోధలను అతను వివరించారు.

శాంతిదేవుడు

శాంతిదేవుడు బోధిసత్వుల ఆచారాన్ని, మరియు ప్రవర్తనను వివరించిన గొప్ప భారతీయ గురువు.

అతిషా

బౌద్ధమతం తాత్కాలికంగా నిర్మూలన అయిన తర్వాత అతిషా భారతదేశం నుండి టిబెట్ కు దానిని మరోసారి తీసుకెళ్లారు.  

14వ దలైలామా

14 వ దలైలామా టిబెటన్ బౌద్ధమతం యొక్క ఆధ్యాత్మిక అధిపతి, 1989 నోబెల్ శాంతి బహుమతి విజేత మరియు అహింస మరియు కరుణ యొక్క ప్రపంచ చిహ్నం.

యోంగ్జిన్ లింగ్ రింపోచే

యోంగ్జిన్ లింగ్ రింపోచే 14 వ దలైలామా మరియు 97 వ గాండెన్ ట్రిపా, గెలుగ్పా సంప్రదాయం యొక్క ఆధ్యాత్మిక అధిపతి.

సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే

సెంజాబ్ సెర్కాంగ్ రిన్పోచే 14 వ దలైలామా యొక్క గురువులు మరియు మాస్టర్ డిబేట్ భాగస్వాములలో ఒకరు మరియు ఇతను టిబెటన్ బౌద్ధమతం యొక్క గురువు.

సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే II

సెంజాబ్ సెర్కాంగ్ రిన్పోచే II, త్సెన్జాబ్ సెర్కాంగ్ రిన్పోచే యొక్క "తుల్కు" పునర్జన్మ.

గెషే ఎన్గావాంగ్ ధార్గే

గెషే ఎన్గావాంగ్ ధార్గే భారతదేశంలోని ధర్మశాలలోని లైబ్రరీ ఆఫ్ టిబెటన్ వర్క్స్ & ఆర్కైవ్స్ లో పాశ్చాత్యులకు బౌద్ధమతం యొక్క మార్గదర్శక గురువు.
Top